Revanth Reddy: రేవంత్ రెడ్డికి జై కొట్టిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు

by Disha Web Desk 7 |
Revanth Reddy: రేవంత్ రెడ్డికి జై కొట్టిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గాంధీ భవన్ సాక్షిగా ఆదివారం జరిగిన హైడ్రామాలో జిల్లా కాంగ్రెస్ నేతలు సీనియర్లకు షాక్ ఇచ్చారు. అందరూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి జైకొట్టారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కమిటీలో, జిల్లా కమిటీలలో సీనియర్లను కాదని వలస వచ్చిన వారికి పదవులు ఇచ్చారని, కొందరు సీనియర్లు అలకబూనిన విషయం తెల్సిందే. ఆదివారం గాంధీభవన్లో ఎఐసీసీ ఆదేశాల మేరకు హాత్ జోడో పేరిట జరిగిన కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సమావేశంలో జిల్లా నాయకులంతా పాల్గొన్నారు.

నిజామాబాద్ నుంచి పీసీసీ కోశాధికారి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ షబ్బీర్ ఆలీలు హాజరయ్యారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మాజీ విప్ ఈరవత్రి అనిల్, పీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి, ఒడ్డెపల్లి సుభాష్ రెడ్డిలు హాజరయ్యారు. వారితో పాటు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కైలాష్ శ్రీనివాస్‌లు హాజరుకాగా, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ సీనియర్లతో కలిసి సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి వెంట ఉంటామని భరోసా ఇవ్వడం గమనార్హం.

READ MORE

MLA Seethakka: ఆ పదవులు మాకొద్దు: రాజీనామాపై ఎమ్మెల్యే సీతక్క కార్లిటీ

Next Story

Most Viewed